న్యూఢిల్లీ, డిసెంబర్ 10: ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ వద్ద డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న సౌమ్యా చౌరాసియా, ఐఏఎస్ అధికారి సమీర్, మరి కొందరి ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. బొగ్గు పన్ను వసూలు కుంభకోణంపై నమోదైన మనీలాండరింగ్ కేసులో దాదాపు రూ.152 కోట్ల విలువైన ఫ్లాట్లు, ప్లాట్లు, బంగారం, నగదును జప్తు చేసినట్టు వెల్లడించింది.
ఛత్తీస్గఢ్లో రవాణా అవుతున్న ప్రతి టన్ను బొగ్గుపై అక్రమంగా రూ.25 వసూలు చేస్తున్నారని ఆరోపణలు రావడంతోనే మనీలాండరింగ్ కేసును నమోదు చేసినట్టు తెలిపింది. కాగా ఈ కేసులో ఇప్పటికే సౌమ్యతోపాటు మరో నలుగురు నిందితులను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.