Srinagar | 70 ఏళ్ల క్రితం బ్రిటీషర్స్ను తరిమికొట్టి, విముక్తి కల్పించే ఛాన్స్ ప్రజలకు వచ్చిందని, ఇప్పుడు బీజేపీని ఓడించే ఛాన్స్ ప్రజలకు వచ్చిందని జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. ఆ పోరాటం కంటే ఇదే పెద్ద పోరాటమని, ఎందుకంటే బీజేపీ వాళ్లు ఈ దేశాన్ని మతాల వారీగా విభజించాలని చూస్తున్నారని ఆరోపించారు. జమ్మూ కశ్మీర్ ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను తీవ్ర స్థాయిలో వ్యతిరేకించాలని పార్టీ కార్యకర్తలకు ఆమె సూచించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా ప్రజల ఇళ్లను కూల్చేస్తున్నారని, ఇది ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని ఆమె మండిపడ్డారు. బీజేపీ నేతల అక్రమ నిర్మాణాలను మాత్రం అధికారులు ముట్టుకోవడం లేదని, కేవలం పేద ప్రజల విషయంలోనే అత్యంత కఠినత్వంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.