న్యూఢిలీ: గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం సీరమ్ సంస్థ తయారు చేసిన స్వదేశీ టీకా ‘సెర్వవాక్’ ఈ నెలలోనే మార్కెట్లోకి రానుంది. రెండో డోసులు కలిగి ఉండే సీసా(వయల్) ధర రూ.2 వేలుగా నిర్ణయించారు. ఇప్పటి వరకు విదేశాల్లో తయారైన టీకాలపైనే భారత్ ఆధారపడేది. జూన్ నుంచి 9-14 ఏండ్ల బాలికలకు ఈ టీకాను అందించాలని కేంద్రం ఆలోచిస్తున్నది.
భారత్లో ఏటా 80 వేల మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్ బారిన పడుతుండగా, 35 వేల మంది మరణిస్తున్నారు.