న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: సంస్కరణలను అమలు చేసేందుకు రాష్ర్టాలకు 50 ఏండ్ల పాటు వడ్డీ లేని రుణంగా రూ.75 వేల కోట్లు ఇవ్వనున్నట్టు సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. వికసిత్ను భారత్ను సాకారం చేసుకొనేందుకు రాష్ర్టాల్లో అభివృద్ధికి వీలు కల్పించే అనేక సంస్కరణలు అవసరమని పేర్కొన్నారు.
ఈ మేరకు రాష్ర్టాలకు వడ్డీ లేకుండా రుణ మంజూరును ప్రతిపాదిస్తున్నట్టు తెలిపారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా, వికసిత్ భారత్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకొన్నామని, ఇందు కోసం ప్రజల సాధికారతను, సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. ప్రజల అభివృద్ధికి తమ ప్రభుత్వం అన్ని స్థాయిలో కృషి చేస్తుందన్నారు.