న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: రేషన్ కార్డుల జారీ లో అర్హతలకు సంబంధించి కేంద్రం మార్పు లు చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. అర్హతల విషయమై ఆహార, ప్రజాపంపిణీ విభాగం త్వరలోనే రాష్ర్టాల అధికారులతో సమావేశం కానున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం 80 కోట్ల మందికి పైగా ప్రజలు ఆహార భద్రత చట్టం కింద లబ్ధి పొందుతున్నారు. అర్హతల్లో మార్పులు చేస్తే వీరిలో చాలా మంది పథకానికి దూరం అవుతారని అంచనా