న్యూఢిల్లీ: బీజేపీని వీడి టీఎంసీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో భద్రతను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఇప్పటి వరకు ఆయనకు ఉన్న రెండో అత్యధిక భద్రతా స్థాయి జట్ కేటగిరీ నుంచి వై కేటగిరీకి కుదించింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ మేరకు శుక్రవారమే ఆదేశాలు జారీ చేసింది. దీంతో బాబుల్ సుప్రియోకు గతంలో ఉన్న ఆరేడు మంది భద్రతా కమాండోలకు బదులు ఇద్దరు మాత్రమే ఉంటారు. టీఎంసీలో చేరిన ఆయనకు బెంగాల్ ప్రభుత్వం పోలీస్ సిబ్బందితో రక్షణ కల్పించే అవకాశం ఉండటంతో ఈ భద్రతపై కూడా సమీక్షించి మరింతగా తగ్గించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.
కాగా, పశ్చిమ బెంగాల్కు చెందిన బాబుల్ సుప్రియో శనివారం బీజేపీని వీడి టీఎంసీలో చేరారు. కేంద్ర కేబినెట్ నుంచి తప్పించడంపై ఆవేదన వ్యక్తం చేసిన ఆయన రాజకీయాలను వీడుతున్నట్లు చెప్పారు. అయితే బెంగాల్కు సేవ చేసేందుకు తిరిగి రాజకీయాల్లోకి వచ్చినట్లు టీఎంసీలో చేరిన తర్వాత మీడియాతో అన్నారు.