Apple devices | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: దేశంలో యాపిల్ డివైజ్లను వినియోగిస్తున్న యూజర్లకు కేంద్ర ప్రభుత్వం భద్రతా పరమైన హెచ్చరికలు జారీచేసింది. పలు సెక్యూరిటీ పరమైన లోపాలను గుర్తించామని, దీని ద్వారా సైబర్ నేరస్తులు ఇతరుల డివైజుల్లోకి చొరబడి డాటాను తస్కరించే అవకాశం ఉన్నదని, యూజర్లు తమ డివైజ్లను అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ టీమ్(సీఈఆర్టీ-ఇన్) తాజాగా ఓ ప్రకటనలో పేర్కొన్నది.
సఫారీ, ఇతర బ్రౌజర్లు వినియోగించే వెబ్కిట్ బ్రౌజర్ ఇంజిన్లో ఈ సెక్యూరిటీ లోపాన్ని గుర్తించినట్టు వెల్లడించింది. ఇది ఐఫోన్లు, వాచ్లు సహా అన్ని యాపిల్ ఉత్పత్తుల్లో వస్తుందని తెలిపింది.