భువనేశ్వర్: కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ సర్కారు తీరుపై ఒడిశాలో అధికార బిజూ జనతాదళ్ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ ఒడిశా అసెంబ్లీ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. నిరసనలో భాగంగా తమ డిమాండ్లతో కూడిన బ్యానర్లను ప్రదర్శించారు.
అదేవిధంగా రైతులకు సాధ్యమైనంత త్వరలో కనీస మద్దతు ధర కల్పించాలంటూ బీజేడీ ఎమ్మెల్యేలు కేంద్ర సర్కారును డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నదని వారు ఆరోపించారు. ఒడిశాలోని రైతులకు రూ.2,930 కనీస మద్ధతు ధర కల్పించాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశామని, కానీ కేంద్రం ఇప్పటికీ దాన్ని అమలు చేయడంలేదని మండిపడ్డారు.