న్యూఢిల్లీ, మే 20: పలు దేశాల్లో మంకీ పాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం, ఐసీఎంఆర్లను కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదేశించారు.
ఎయిర్పోర్టులు, పోర్టుల అధికారులు దీనిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంకీపాక్స్ సోకిన దేశాలకు వెళ్లి వస్తున్న ప్రయాణికుల ఆరోగ్యం బాగోలేకపోతే.. వారి నుంచి నమూనాలను పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపాలని చెప్పారు.