సుప్రీంకు తెలిపిన కేంద్రం
న్యూఢిల్లీ, అక్టోబర్ 4: నీట్ పోస్టుగ్రాడ్యుయేట్ సూపర్ స్పెషాలిటీ పరీక్షలను రెండు నెలల పాటు వాయిదా వేస్తామని కేంద్రం తెలిపింది. పరీక్షా విధానంలో చివరి నిమిషంలో మార్పులు చేయడంపై సుప్రీంకోర్టు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది. ‘ప్రిపరేషన్కు మరింత సమయం ఇచ్చేలా వచ్చే ఏడాది జనవరి 10, 11 తేదీల్లో పరీక్షలు నిర్వహించేందుకు మమ్మల్ని అనుమతించండి’ అని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కోరింది.