న్యూఢిల్లీ: 18 రాష్ర్టాల్లోని భూగర్భ జలాల్లో యురేనియం నిల్వలు ఉండాల్సిన స్థాయి కన్నా అధికంగా ఉన్నట్టు కేం ద్ర భూగర్భ జల బోర్డు గుర్తించింది. 18 రాష్ర్టాల్లో 14,377 భూగర్భ జల నమూనాలను పరీక్షించగా, 409 నమూనాల్లో బీఐఎస్ పరిమితి (0.03 మి.గా. /లీటర్) కన్నా ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు.
ఈ మేరకు లోక్సభలో కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ శనివారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. సంబంధిత రాష్ర్టాలకు ఈ సమాచారం అందించామని, తగిన చర్యలు కూడా తీసుకోవాలని సూచించినట్టు పేర్కొన్నారు.