Central Govt | ప్రధాని నరేంద్ర మోదీ రోడ్డు మార్గంలో ప్రయాణిస్తారని పంజాబ్ పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చామని కేంద్రం పేర్కొంటోంది. ఈ విషయంతో పాటు సెక్యూరిటీ విషయంపై కూడా చాలా సార్లు మాట్లాడుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధాని మోదీకి భద్రతాపరమైన ఇబ్బందుల విషయం పంజాబ్ ప్రభుత్వానికి తెలియదన్నది ఓ అపోహ మాత్రమేనని కేంద్రం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రధాని భద్రత, ప్రయాణానికి సంబంధించి పలుమార్లు పంజాబ్ పోలీసులతో చర్చించామని, దీనికి సంబంధించిన అంతర్గత డాక్యుమెంట్లు కూడా ఉన్నాయని పేర్కొంది. రైతు ధర్నా కారణంగా రోడ్డు బ్లాక్ అయ్యిందని, ఈ కారణంగా ట్రాఫిక్ మళ్లింపు విషయంపై కూడా పంజాబ్ పోలీసులతో చర్చలు జరిగాయని కేంద్రం పేర్కొంటోంది.