న్యూఢిల్లీ: విదేశాలకు ప్రయాణించేవారు విమానాశ్రయాల్లోని ఇమ్మిగ్రేషన్ కేంద్రాల్లో ఇకపై భౌతిక బోర్డింగ్ పాస్ను చూపాల్సిన అవసరం లేదని అధికారులు శనివారం తెలిపారు. ఆ పత్రానికి స్టాంపింగ్ వేయడాన్ని సెప్టెంబర్ 1 నుంచి నిలిపేయాలని అధికారులు నిర్ణయించడమే ఇందుకు కారణం.
ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి వారు తమ ఫోన్లో ఈ-బోర్డింగ్ పాస్ను చూపిస్తే సరిపోతుంది. బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ఈ మేరకు ఇటీవల అధికారులకు ఆదేశాలు జారీచేసింది. అయితే సెప్టెంబర్ 1 తర్వాత కూడా భౌతిక బోర్డింగ్ పాసులను అనుమతించే ప్రక్రియ కొనసాగుతుంది, కానీ వాటిపై స్టాంపింగ్ చేయరు.