ప్రచారం: నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి నిరుద్యోగ భృతి పథకం’ కింద నెలకు రూ.6 వేలు ఇస్తున్నదని ఓ మెసేజ్ వాట్సాప్లో తెగ ప్రచారం అవుతున్నది. ఈ పథకం లబ్ధి పొందేందుకు మొబైల్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొంటూ అందులో ఓ లింక్ కూడాఉన్నది.
వాస్తవం: ఈ వాట్సాప్ సందేశ సారాంశాన్ని పీఐబీ ఫాస్ట్చెక్ ఖండించింది. ఇది ఫేక్ అని, భారత ప్రభుత్వం అసలు అటువంటి స్కీమ్ను ప్రవేశపెట్టలేదని స్పష్టం చేసింది. ఆ మెసేజ్ను సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయొద్దని సూచించింది.