Google Chrome | గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. గూగుల్ క్రోమ్ యూజర్ల డాటా తస్కరణకు గురయ్యే అవకాశం ఉందంటూ తెలిపింది. క్రోమ్లో హ్యాక్కు గురయ్యే కొన్ని అంశాలను గుర్తించినట్టు పేర్కొంది.
వెంటనే క్రోమ్ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ-ఇన్) వెల్లడించింది. అప్డేట్ చేసుకోకపోతే యూజర్ల వ్యక్తిగత డేటా, బ్యాంకు సంబంధిత సమాచారం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని తెలిపింది.