న్యూఢిల్లీ: ఓటీటీ నెట్వర్క్లు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్లను కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తమ నియంత్రణలోకి తెచ్చుకుంటున్నాయని వాషింగ్టన్ పోస్ట్ కథనం పేర్కొన్నది. కేసుల బెదిరింపులు, పెద్దయెత్తున ఒత్తిడి తీసుకురావడం ద్వారా నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో వేదికలపై ఏ విధమైన కంటెంట్ ప్రసారం చేయాలో నిర్దేశిస్తున్నాయని వ్యాఖ్యానించింది.
హిందూ మితవాదాన్ని, బీజేపీని , హిందూ మతాన్ని కించపరిచే రెఫరెన్స్లను తొలగించాలని ఆదేశిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించినట్టు పేర్కొన్నది. దీంతో భారత రాజకీయ, మత, కుల విభజనలపై ఈ ఓటీటీ నెట్వర్క్లు చేపట్టిన ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చిందని, పూర్తయిన వెబ్ సిరీస్లు, సినిమాలు కూడా వీక్షకులకు నిలిపివేయబడ్డాయని నివేదించింది.