Petrol : వాహనదారులకు గుడ్న్యూస్. పెట్రోల్, డీజిల్ సరఫరాపై విధించిన ఆంక్షలను కేంద్రం ఎత్తేయనుంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ సరఫరాపై ఆంక్షలను కొనసాగుతున్న జూలై 1వ తేదీ బుధవారం నుంచి ఎత్తివేస్తున్నట్టు వెల్లడించింది. దేశంలో పెట్రోలియం ఉత్పత్తులు సాధారణ స్థితికి చేరినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం తెలిపింది.
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా పెట్రోలియం ఉత్పత్తుల కొరత ఏర్పడడంతో.. జూన్ 12వ తేదీన సరఫరాపై కేంద్రం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు, ఒప్పందాలు కుదరడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది. దాంతో, దేశంలో పెట్రోల్, డీజిల్ సరఫరా మునపటి స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్పై విధించిన ఆంక్షలను జూలై 1 నుంచి కేంద్రం ఎత్తేయనుంది.