చెన్నై : తమిళనాడులోని కూనూర్లో భారత వాయుసేనకు చెందిన ఎంఐ-17వీ5 హెలికాఫ్టర్ కుప్పకూలిన ఘటనలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన భార్య మధూలిక రావత్ మరో 11 మంది మరణించారు. వెల్లింగ్టన్ (నీలగిరి హిల్స్)లోని డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజ్లో స్టాఫ్ కోర్స్ ఫ్యాకల్టీ, స్టూడెంట్ ఆఫీసర్లను ఉద్దేశించి ఉపన్యాసం ఇచ్చేందుకు సీడీఎస్ బిపిన్ రావత్ బుధవారం మద్యాహ్నం సలూర్ ఎయిర్బేస్ నుంచి హెలికాఫ్టర్లో వెళుతుండగా కూనూర్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటనలో బిపిన్ రావత్ మరణించారని బుధవారం సాయంత్రం ఐఏఎఫ్ ప్రకటించింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ప్రస్తుతం వెల్లింగ్టన్లోని మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఐఏఎఫ్ పేర్కొంది. మరోవైపు సీడీఎస్ బిపిన్ రావత్ మృతి, హెలికాఫ్టర్ ప్రమాదంపై ప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశమైంది.