కోల్కతా: బంగ్లాదేశ్ ఎంపీ(Bangladesh MP) అన్వరుల్ అజిమ్ అనార్ను హత్య చేసిన విషయం తెలిసిందే. ఓ మహిళ వలలో పడిన ఆ ఎంపీ .. ఆమె తీసుకెళ్లిన ఫ్లాట్కు వెళ్లాడు. ఆ ఇంట్లోనే ఎంపీని హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. అయితే ఆ ఫ్లాట్ నుంచి ఇద్దరు వ్యక్తులు బయటకు వస్తున్న దృశ్యాలు సీసీటీవీకి చిక్కాయి. అపార్ట్మెంట్ నుంచి వస్తున్న ఆ ఇద్దరిలో ఒకరు సూట్కేసుతో, మరో ప్లాస్టిక్ బ్యాగులతో బయటకు వెళ్తున్న దృశ్యాలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే బంగ్లా వలసదారుడు జిహాద్ హవల్దార్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ మర్డర్ను ఎలా ప్లాన్ చేసి అమలు చేశారో పోలీసులకు హవల్దార్ తెలిపాడు.
హత్య చేసిన తర్వాత శరీర చర్మాన్ని తొలిచారు ఆ తర్వాత మాంసాన్ని తీసివేశారు. ఆ మాంసాన్ని ముక్కలుగా చేశారు. ప్లాస్టిక్ బ్యాగుల్లో ఆ ముక్కల్ని నింపి వాటిని నగరంలో పలు చోట్ల పడేసినట్లు తెలిసింది. వలపు వల వేసి ఎంపీని ఫ్లాట్కు తీసుకెళ్లిన షీలాస్తీ రెహ్మాన్ అనే మహిళ గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. హనీట్రాప్ కోణంలో విచారణ కొనసాగుతున్నది. మే 12వ తేదీన కోల్కతాకు వచ్చిన ఎంపీ అన్వరుల్.. మే 14వ తేదీ నుంచి ఆచూకీ లేరు. దీంతో పోలీసులు ఈ కేసులో దర్యాప్తు మొదలుపెట్టారు.
📹 Watch | Bangladesh MP’s Killers Took Body Parts In Suitcase? CCTV Footage Emerges
🔗 https://t.co/z5yszIOQsB pic.twitter.com/XNALl6y5qy
— NDTV (@ndtv) May 24, 2024