శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో సీఆర్పీఎఫ్ సిబ్బందిపై శనివారం గ్రెనేడ్ దాడి జరిగింది. శ్రీనగర్లోని బార్బర్ షా ప్రాంతంలో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదులు కారులో వెళ్తూ సీఆర్పీఎఫ్ సిబ్బందిపైకి గ్రెనేడ్ విసిరారు. అయితే సిబ్బంది తప్పించుకోగా రోడ్డుపై వెళ్తున్న ముగ్గురు పౌరులు గాయపడ్డారు. సీసీటీవీలో రికార్డైన వీడియోను అధికారులు విడుదల చేశారు. కారు నంబర్ ఆధారంగా గ్రెనేడ్ దాడి చేసిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.