న్యూఢిల్లీ: 10, 12 తరగతుల టెర్మ్ 1 బోర్డు పరీక్షల తేదీలను సీబీఎస్ఈ సోమవారం ప్రకటించింది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 11 వరకు 10వ తరగతి, డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 22 వరకు 12వ తరగతి ప్రధాన సబ్జెక్టులకు టెర్మ్ 1 బోర్డు పరీక్షలను నిర్వహించనున్నది. అధికారిక వెబ్సైట్ cbse.gov.in, cbseacademic.nic.in లో ఈ మేరకు ప్రకటించింది. విద్యార్థులు సంబంధిత పాఠశాలల నుంచి అడ్మిట్ కార్డులు పొందాలని పేర్కొంది.
10, 12 తరగతులకు సంబంధించిన సబ్జెక్స్ను మేజర్, మైనర్గా సీబీఎస్ఈ విభజించింది. అభ్యర్థులకు సంబంధిత పాఠశాలల్లో ప్రధాన సబ్జెక్టులకు ముందు మైనర్ సబ్జెక్ట్స్లో పరీక్షలు నిర్వహిస్తారు. పాఠశాలలను తదనుగుణంగా గ్రూప్ చేసి బహుళ మైనర్ సబ్జెక్ట్ పరీక్షలు నిర్వహించబడతాయి. విద్యార్థుల అభ్యాస నష్టాన్ని నివారించడానికి ఈ మేరకు సీబీఎస్ఈ నిర్ణయించింది.