న్యూఢిల్లీ, మే 12: సీబీఎస్ఈ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. పదో తరగతిలో 93.12 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 12వ తరగతిలో 87.33 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. పదో తరగతి ఉత్తీర్ణత శాతం గత ఏడాది(94.40) కంటే 1.28 శాతం తగ్గగా, పన్నెండో తరగతి ఉత్తీర్ణత శాతం గత ఏడాది(92.71 శాతం) కంటే 5.38 శాతం తగ్గింది. రెండు తరగతుల్లోనూ అబ్బాయిల కంటే అమ్మాయిలే అత్యధిక శాతం ఉత్తీర్ణత సాధించారు.
10వ తరగతిలో 93.12 శాతం ఉత్తీర్ణత
పదో తరగతిలో 21,65,805 మంది పరీక్షలు రాయగా 20,16,779 మంది ఉత్తీర్ణులయ్యారు. అబ్బాయిల్లో 92.27 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, వీరి కంటే 1.98 శాతం ఎక్కువగా అమ్మాయిల్లో 94.25 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
12వ తరగతిలో 87.33 శాతం ఉత్తీర్ణత
పన్నెండో తరగతిలో 16,60,511 మంది పరీక్షలు రాయగా 14,50,174 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అబ్బాయిల్లో 84.67 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, వీరి కంటే 6.01 శాతం ఎక్కువగా అమ్మాయిల్లో 90.68 శాతం మంది ఉత్తీర్ణత పొందారు.
ఈసారి నో మెరిట్ లిస్ట్
విద్యార్థుల మధ్య అనారోగ్య పోటీని నివారించేందుకు ఈ ఏడాది మెరిట్ లిస్ట్ను ప్రకటించడం లేదని సీబీఎస్ఈ పేర్కొన్నది.