న్యూఢిల్లీ, మే 27: ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షలకు హాజరుకాని పదో తరగతి విద్యార్థులకు సంబంధించి పాఠశాలలకు సీబీఎస్ఈ కీలక సూచన చేసింది. ఆ విద్యార్థులకు ఆన్లైన్/ఆఫ్లైన్ లేదా ఫోన్ ద్వారా అసెస్మెంట్ నిర్వహించాలని ఆదేశించింది. కొత్త ఆదేశాల ప్రకారం.. ప్రతి సబ్జెక్టులో 100 మార్కులకు గాను ఇంటర్నల్ పరీక్షలకు 20 మార్కులు, ఫైనల్ పరీక్షకు 80 మార్కులు ఉంటాయి. ఫైనల్ పరీక్షలు రద్దు కావడంతో ఆ 80 మార్కులకు ఎన్ని మార్కులు వేయవచ్చనేది ఇంటర్నల్ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా నిర్ణయించనున్నారు. ఎవరైనా విద్యార్థులు ఇంటర్నల్ పరీక్షలకు హాజరుకాకపోతే వారికి ఆన్లైన్/ఆఫ్లైన్ లేదా ఫోన్ ద్వారా అసెస్మెంట్ నిర్వహించాలని సీబీఎస్ఈ తెలిపింది. దీనికి డాక్యుమెంటరీ ఆధారాలను రికార్డు చేయాలని స్పష్టం చేసింది. ఎవరైనా విద్యార్థి అందుబాటులో లేకపోయినా, ఫోన్లో దొరక్కపోయినా ‘ఆబ్సెంట్’గా మార్క్ చేయాలని సూచించింది. పాఠశాలలు జూన్ 30లోగా మార్కుల పట్టికలు రూపొందించాలని పంపిచాలని గడువు విధించింది.