న్యూఢిల్లీ : రాజస్థాన్లో మెహందీపూర్ బాలాజీలోని ఎస్బీఐ బ్రాంచ్లో రూ.11కోట్ల విలువైన నాణేలు మాయమయ్యాయి. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. స్వాధీనం చేసుకున్నది. గతంలో రాజస్థాన్ పోలీసులు చేసిన ఎఫ్ఐఆర్ను స్వాధీనం చేసుకున్నది. ప్రాథమిక విచారణలో బ్యాంకులో నగదు నిలువల్లో తేడాలున్నాయి ఎస్బీఐ శాఖ గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
బ్యాంకుల్లో ఉన్న నాణేల లెక్కించేందుకు జైపీర్కు చెందిన ఓ ప్రైవేటు వ్యక్తిని రూ.13కోట్లకుపైగా విలువైన నాణేల లెక్కింపు చేపట్టేందుకు జైపీర్కు చెందిన ఓ ప్రైవేటు వెండర్ను నియమించారు. ఈ మేరకు కౌంటింగ్ నిర్వహించగా.. రూ.11కోట్లకుపైగా నాణేలు మాయమైనట్లు కౌంటింగ్లో తేలింది. ప్రస్తుతం రూ.2 కోట్లకు సంబంధించి 3వేల బ్యాగులు ఉండగా.. వాటిని ఆర్బీఐ కాయిన్ హోల్డింగ్ బ్రాంచ్కు బదిలీ చేశారు. 2021 ఆగస్ట్లో నగదు లెక్కింపును నిలిపివేయాలంటూ వెండర్ వద్ద పని చేసే సిబ్బందిని కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు గురి చేసినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.