న్యూఢిల్లీ: బ్రిటన్కు చెందిన రోల్స్ రాయ్స్(Rolls Royce) కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ కంపెనీ ఇండియా డైరెక్టర్ టిమ్ జాన్స్తో పాటు సుధీర్ చౌదరీ, భాను చౌదరి, బ్రిటీష్ ఏరోస్పేస్ సిస్టమ్స్పై ఈ కేసు నమోదైంది. హాక్ విమానాల ప్రొక్యూర్మెంట్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ హాక్ విమానం కొనుగోలు అంశంలో గుర్తు తెలియని ఆఫీసర్లు అవినీతికి పాల్పడినట్లు సీబీఐ ఆరోపిస్తున్నది. 2004లో 123 హాక్ 115 అడ్వాన్స్డ్ జెట్ విమానాలను భారత్ కొనుగోలు చేసింది.
అప్పట్లో అధికారంలో ఉన్న ఆఫీసర్లు రూ.5653 కోట్లతో24 హాక్ విమానాలను కొనుగోలు చేశారు. ఆ ప్రొక్యూర్మెంట్లో అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫ్లై అవే కండీషన్లో ఆ విమానాలను అందించాలని ఒప్పందం జరిగింది. ఆ తర్వాత 42 విమానాల కోసం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఒప్పందం కుదిరింది. 1944 కోట్లతో ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కు అంగీకారం జరిగింది. మధ్యవర్తులకు ముడుపులు ఇవ్వకూడదని ఒప్పందం ఉన్నా.. రోల్స్ రాయ్స్ ఇండియా కంపెనీ తమ ట్యాక్స్ వ్యవహారాలను తప్పించుకునేందుకు భారతీయ అధికారులకు లంచం ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.