న్యూఢిల్లీ: కిరు హైడ్రోపవర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి ఆరోపణలకు సంబంధించి జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ నివాసంలో గురువారం సీబీఐ సోదాలు నిర్వహించింది. మరికొందరి ఇండ్లు, కా ర్యాలయాల్లోనూ తనిఖీలు చేపట్టింది.
దాదాపు 100 మంది అధికారులు జమ్ముకశ్మీర్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఢిల్లీ, ముంబైలలో 30 చోట్ల సోదాలు చేశా రు. బీజేపీ సర్కారు విధానాలపై మాలిక్ తరచూ విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. కిరు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన రూ.2,200 కోట్ల విలువైన సివిల్ వర్క్ను ఓ ప్రైవేటు కంపెనీకి కేటాయించారని, ఈ కేటాయింపులో అవినీతి జరిగిందని సీబీఐ ఆరోపించింది.