న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) స్కామ్ కేసులో బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్కు మంజూరైన బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ శనివారం సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో అత్యున్నత ధర్మాసనం తేజస్వీయదవ్కు నోటీసు జారీచేసింది. ఈ నెల 28లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించింది. ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టు మంజూరు చేయడంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై తేజస్వీకి గతంలో సీబీఐ సమన్లు జారీచేసింది. ఈ కేసులో తేజస్వీకి 2018 అక్టోబర్లో బెయిల్ మంజూరైంది.