ఎఫ్బీ డేటా చోరీ.. కేంబ్రిడ్జ్ అనలిటికాపై సీబీఐ కేసు

న్యూఢిల్లీ: ఫేజ్బుక్ యూజర్ల డేటా చోరీ ఆరోపణలపై బ్రిటన్కు చెందిన కేంబ్రిడ్జ్ అనలిటికా ఏజెన్సీపై సీబీఐ కేసు నమోదు చేసింది. సుమారు 5.62 లక్షల భారతీయ ఎఫ్బీ యూజర్ల డేటాను కేంబ్రిడ్జ్ అనలిటికా అక్రమ రీతిలో సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గ్లోబల్ సైన్స్ రీసర్చ్(జీఎస్ఆర్ఎల్) అనే మరో కంపెనీ కూడా డేటా చోరీకి పాల్పడినట్లు సీబీఐ తన కేసులో నమోదు చేసింది. ఫేస్బుక్ - కేంబ్రిడ్జ్ అనలిటికా డేటా చోరీ కేసులో సీబీఐ విచారణ జరుగుతుందని కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా తెలిపారు.
సీబీఐ విచారణ పట్ల సోషల్ మీడియా కంపెనీ ఫేస్బుక్ స్పందించింది. గ్లోబల్ సైన్స్ కంపెనీ అక్రమంగా భారతీయ యూజర్ల డేటాను సేకరించిందని, ఆ డేటాను కేంబ్రిడ్జ్ అనలిటికాతో షేర్ చేసినట్లు ఎప్బీ చెప్పింది. ఆ తర్వాత ఆ డేటాతో భారత్లో ఎన్నికలపై ప్రభావం చూపే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. కేంబ్రిడ్జ్ అనలిటికా అక్రమ రీతిలో డేటాను సేకరించినట్లు పలు కంపెనీలు 2018లో ఆరోపణలు చేశాయి. ఆ ఆరోపణల ఆధారంగా కేంబ్రిడ్జ్ అనలిటికాతో పాటు జీఎస్ఆర్ఎల్పై సీబీఐ విచారణ చేపట్టింది.
తాజావార్తలు
- చంద్రుడిని చుట్టొద్దాం.. దరఖాస్తు చేసుకోండి
- తప్పుకున్న నీరా టండన్.. బైడెన్కు చుక్కెదురు
- దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
- అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది దుర్మరణం
- శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం
- 9 నుంచి ఇంద్రకీలాద్రిపై మహాశివరాత్రి ఉత్సవాలు
- ఇన్నోవేషన్స్ సమాజంపై ప్రభావం చూపాలి : పీయూష్ గోయల్
- స్టాఫ్నర్స్ పోస్టులకు వెబ్ ఆప్షన్లు
- 5 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
- రేడియోలాజికల్ ఫిజిక్స్లో ఎమ్మెస్సీ డిప్లొమా