CBI | ఒక ప్రైవేట్ కంపెనీకి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలపై పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ బీఎస్ ఝా, ఆరుగురు టాటా ప్రాజెక్ట్స్ అధికారులను అరెస్ట్ చేసినట్లు సీబీఐ అధికారులు గురువారం తెలిపారు. టాటా ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు దేశ్రాజ్ పాఠక్, అసిస్టెంట్ ఉపాధ్యక్షుడు ఆర్ఎన్ సింగ్లు అరెస్టయిన వారిలో ఉన్నారు. ఈ అభియోగాలకు సంబంధించి సీబీఐ అధికారులు ఘజియాబాద్, నొయిడా, గురుగ్రామ్తదితర ప్రాంతాల్లో సీబీఐ బుధవారం తనిఖీలు నిర్వహించింది.
బీఎస్ఝా ఇంట్లో రూ.93 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నది. ప్రస్తుతం ఈటానగర్లో బీఎస్ ఝా పని చేస్తున్నారు. టాటా ప్రాజెక్ట్స్కు చెందిన పలు ప్రాజెక్టులకు బీఎస్ ఝా అనుకూలంగా వ్యవహరించారని సీబీఐ అధికారులు ఆరోపించారు. అందుకు ముడుపులు అందుకున్నారని తెలిపారు.
టాటా ప్రాజెక్ట్స్, ఇతర కంపెనీలకు వివిధ ప్రాజెక్టులపై అనుకూలంగా వ్యవహరించినందుకు ఆయా కంపెనీల నుంచి ఝా ముడుపులు స్వీకరించినట్లు సమాచారం అందినప్పటి నుంచి ఝాపై సీబీఐ అధికారుల నిఘా కొనసాగింది. బుధవారం ముడుపులు స్వీకరిస్తున్న ఝాను రెడ్ హ్యాండెడ్గా సీబీఐ అధికారులు పట్టుకున్నారు.