WAPCOS | న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్కోస్ (వాటర్, పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ సర్వీసెస్) మాజీ చైర్మెన్, ఎండీ రాజిందర్ గుప్తా, కుమారుడు గౌరవ్ వద్ద సీబీఐ రూ.38 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నది. రాజిందర్ గుప్తా, ఆయన కుటుంబ సభ్యులు అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై సీబీఐ బుధవారం దాడులు నిర్వహించింది.
ఢిల్లీ, గురుగావ్, చండీగఢ్, సోనేపట్, ఘజియాబాద్లలో ఏకకాలంలో సోదాలు జరిపింది. ‘2011- 2019 మధ్య అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు వెలువడ్డాయి. రాజిందర్ గుప్తా, ఆయన కుమారుడు గౌరవ్ను అరెస్టు చేశాం’ అని సీబీఐ ఒక ప్రకటనలో తెలిపింది.