న్యూఢిల్లీ, మే 5: విద్యుత్తు కొరత ముంచుకు రానున్నట్టు నివేదికలు హెచ్చరించినా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించిన కేంద్రం.. తీరా సంక్షోభం ముదరగానే నష్టనివారణ చర్యలు చేపట్టింది. బొగ్గు సరఫరా పేరిట ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నది. విద్యుదుత్పత్తి కోసం ప్లాంట్లకు బొగ్గును రవాణా చేసే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగకుండా మరో 1,100 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. మే 24 వరకు సేవల రద్దు కొనసాగుతుందని వెల్లడించింది. రైద్దెన రైళ్లలో మెయిల్ ఎక్స్ప్రెస్లు కూడా ఉన్నాయి. ముందుచూపు లేకుండా కేంద్రం తీసుకొంటున్న హడావుడి చర్యలపై పలువురు మండిపడుతున్నారు.