Case on Jawan | మన దేశానికి చెందిన ముఖ్య సమాచారాన్ని, ప్రదేశాల ఫొటోలను పాకిస్తాన్ ఐఎస్ఐకి చేరవేస్తూ ఓ ఆర్మీ జవాన్ పట్టుబడ్డాడు. ఆతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అమృత్సర్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. యూపీకి చెందిన ఈ వ్యక్తి అమృత్సర్లో ఆర్మీ జవాన్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతడిని అరెస్ట్ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
కేంద్ర భద్రతా సంస్థల సమాచారం మేరకు అమృత్సర్ రూరల్ పోలీసులు ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం నిందితుడైన ఆర్మీ జవాన్ను అరెస్టు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కేసుతో సంబంధమున్న మరికొందరు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఉసారా రసూల్పూర్ గ్రామానికి చెందిన మనోజ్ చౌదరి అనే ఆర్మీ జవాన్.. పాకిస్తాన్ ఐఎస్ఐకి ముఖ్య సమాచారాన్ని, ఫొటోలను చేరవేస్తున్నాడని కేంద్ర భద్రతా సంస్థలు సమాచారం ఇచ్చినట్లు అత్తారి డీఎస్పీ పర్వేష్ చోప్రా తెలిపారు.
సదరు నిందితుడు మనోజ్ చౌదరి వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా పాకిస్తాన్ స్మగ్లర్లు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో కనెక్ట్ అయినట్లుగా తెలుస్తున్నది. కేంద్ర భద్రతా సంస్థలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఘరిండా పోలీస్ స్టేషన్ పోలీసులు మనోజ్ చౌదరిపై అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ 1923, 3,4,5,9 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరిపారు. మనోజ్ చౌదరిని త్వరలో అరెస్ట్ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ పర్వేష్ చోప్రా చెప్పారు.