జావెద్ అక్తర్పై మహారాష్ట్రలో కేసు
ముంబై: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్)ను తాలిబన్లతో పోల్చిన కారణంగా ప్రముఖ రచయిత జావెద్ అక్తర్పై మహారాష్ట్ర పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ముంబైకి చెందిన న్యాయవాది సంతోష్ దూబే ఫిర్యాదు మేరకు కేసు నమోదైనట్టు అధికారులు తెలిపారు. జావెద్ అక్తర్ సెప్టెంబర్లో ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో ఆరెస్సెస్ను తాలిబన్లతో పోల్చారు. దీనిపై సంతోష్ దూబే అప్పుడే జావెద్ అక్తర్కు నోటీసులు పంపించారు. జావెద్ అక్తర్ నుంచి స్పందన లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.