మదురై: రామేశ్వరం కెఫే పేలుడు ఘటనపై వివావాదస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి శోభా కరంద్లాజేపై కేసు నమోదైంది. రెండు రాష్ర్టాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడారన్న ఫిర్యాదు మేరకు మదురై పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. కరంద్లాజే ఇటీవల మాట్లాడుతూ తమిళనాడులో శిక్షణ పొంది, అక్కడ నుంచి కర్ణాటకకు వచ్చిన వ్యక్తులు బాంబులు పెట్టారని వ్యా ఖ్యానించారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్రం గా మండిపడ్డారు. కరంద్లాజే నిర్లక్ష్యంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో కరంద్లాజే క్షమాపణలు చెప్పారు. వివాదాస్పద వ్యాఖ్యలతో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కరంద్లాజేపై చర్యలు తీసుకోవాలని ఈసీ కర్ణాటక ఎన్నికల ప్రధాన అధికారిని ఆదేశించింది.