ముంబై: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తప్పిదాలకు పాల్పడుతుందా.. గతంలో సంస్థ డైరెక్టర్, ప్రత్యేక డైరెక్టర్ పరస్పరం ఘర్షణకు దిగారు. సుప్రీంకోర్టు అక్షింతలు వేసేవరకు వారి మధ్య వివాదం కొనసాగింది. మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు నిరాధారమేనా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారి.. ఇందులో గుర్తించదగ్గ ఆధారాలేమీ లేవని, దీన్ని మూసేయొచ్చునని సిఫారసు చేశారు. కానీ ఎస్పీ స్థాయి అధికారి మాత్రం అనిల్ దేశ్ముఖ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించినట్లు సీబీఐ అంతర్గత నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదిక మీడియాకు లీకవ్వడం సంస్థకు పెద్ద తలనొప్పిగా మారింది.