న్యూఢిల్లీ: టీఎంసీ ఎంపీ మహువాయ మొయిత్రా(Mahua Moitra) .. ఇవాళ పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ ముందు హాజరయ్యారు. ప్రభుత్వంపై ప్రశ్నలు వేసేందుకు డబ్బులు తీసుకున్నట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. పార్లమెంట్ లాగిన్ ఐడీని ఓ వ్యాపారవేత్తకు ఇచ్చినట్లు కూడా ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ ముందు ఆమె వివరణ ఇవ్వనున్నారు. అయితే ఇవాళ పార్లమెంట్కు వెళ్తున్న సమయంలో ఆమె తన స్టయిల్ను మాత్రం వదలలేదు. మూడు హ్యాండ్బ్యాగులు పట్టుకుని మరీ ఆమె ఎథిక్స్ కమిటీ మీటింగ్కు వెళ్లారు.
వ్యాపారవేత్త దర్శన్ హీరానందని నుంచి డబ్బులు తీసుకుని ఆమె ప్రభుత్వంపై ప్రశ్నలు వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. డబ్బు తీసుకున్న వస్తున్న ఆరోపణలను ఖండించిన ఆమె.. పార్లమెంట్ లాగిన్ ఐడీని మాత్రం వ్యాపారవేత్తకు ఇచ్చినట్లు అంగీకరించారు. ముగ్గురు కేంద్ర మంత్రులు సమర్పించిన డాక్యుమెంట్లు, సాక్ష్యాల ఆధారంగా మహువాను ఎథిక్స్ కమిటీ ప్రశ్నించనున్నది. హోంశాఖ, విదేశాంగ శాఖ, ఐటీ శాఖ ఇచ్చిన నివేదికలు కమిటీ వద్ద ఉన్నాయి.
మహువా మొయిత్రాకు చెందిన లాగిన్ ఐపీ అడ్రెస్తో పాటు ఆమె లొకేషన్ ఒకే వద్ద ఉన్నాయా అని కమిటీ అడిగినట్లు తెలుస్తోంది. మహువాకు వ్యతిరేకంగా వ్యాపారవేత్త హీరానందని ప్రకటన చేయడంతో మహువా అంశం మరింత సంచలనంగా మారింది.
Mahua Moitra caught redhanded with proceeds of crime! #CashforQuestions #CashForQuery #LouisVuittonBags pic.twitter.com/o3SbZXWDWb
— JIX5A (@JIX5A) November 2, 2023