న్యూఢిల్లీ, ఆగస్టు 26: ట్రాఫిక్ కాలుష్యం, సడన్గా బ్రేకులు వేయడం వల్ల గుండెపోటు ముప్పు గణనీయంగా పెరుగుతుందని ఓ అధ్యయనం పేర్కొన్నది. వాహనాల నుంచి వెలువడే నైట్రిక్ ఆక్సైడ్ వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువని జర్మనీలో దాదాపు 18 వేల మందిపై నిర్వహించిన పరిశోధనలో తేలింది.
రోజువారీ సగటుకు మించి విడుదలయ్యే ప్రతి 10 గ్రాముల వా యు కాలుష్యం వల్ల 1 శాతం, మూడు రోజుల పాటు అధిక కాలుష్యం వెలువడటం వల్ల 4 శాతం చొప్పున గుండె పోటు ముప్పు పెరుగుతుందని వివరించింది. హృద్రోగాలు, వాయు కాలు ష్యం వల్ల రక్తప్రసరణలో తలెత్తే సమస్యల వల్ల బ్రిటన్లో ఏటా 11 వేల మంది వరకు మరణిస్తున్నట్టు తెలిపారు.