లక్నో: ఇద్దరు వృద్ధులు కారులో కూర్చొని ఉన్నారు. అయితే నో పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేసినందుకు ఆ కారును క్రేన్ వాహనంతో లాక్కెల్లారు. ఆ కారులో వృద్ధులు ఉన్నప్పటికీ సిబ్బంది పట్టించుకోలేదు. (Car Towed With Senior Citizens) ఈ వీడియో వైరల్ కావడంతో కాంట్రాక్ట్ సిబ్బందిపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. 70 ఏళ్లకుపైగా వయసున్న వ్యక్తి, వృద్ధురాలైన కుటుంబ సభ్యురాలితో కలిసి ఆసుపత్రికి వెళ్లాడు. అయితే నగదు చెల్లించాలని ఆసుపత్రి సిబ్బంది చెప్పడంతోపాటు కొన్ని పత్రాల జిరాక్స్ కోసం సమీపంలోని సెంటర్కు కారులో వెళ్లారు. సెక్టార్ 50లో నో పార్కింగ్ జోన్ బోర్డును చూసుకోని ఆ వృద్ధులు కారును అక్కడ పార్క్ చేశారు.
కాగా, డబ్బులు డ్రా చేసి, పత్రాలు జిరాక్స్ చేయించుకున్న తర్వాత ఇద్దరు వృద్ధులు తిరిగి తమ కారు వద్దకు వచ్చి అందులోకి ఎక్కారు. అయితే నో పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేసినందుకు కాంట్రాక్ట్ సిబ్బంది క్రేన్ వాహనంతో ఆ కారును అక్కడి నుంచి లాక్కెళ్లారు. ఆ వృద్ధులు ఎంతగానో ప్రాధేయపడినప్పటికీ వారు పట్టించుకోలేదు. కొందరు వ్యక్తులు ఆ కారును అనుసరించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
మరోవైపు నోయిడా ట్రాఫిక్ పోలీసులు ఈ సంఘటనపై స్పందించారు. ఆ ప్రాంతంలో పార్కింగ్ బాధ్యతలను నోయిడా డెవలప్మెంట్ అథారిటీ (ఎన్డీయే) చూస్తున్నదని తెలిపారు. అలాగే వృద్ధులతో సహా కారును లాక్కెళ్లిన వాహనాన్ని గుర్తించి దానిని స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం కారులో మనుషులు ఉంటే దానిని లాక్కెళ్లకూడదు. ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ సిబ్బందిపై కేసు నమోదు చేశారు.
Watch | Car Towed With 2 Senior Citizens Sitting Inside In Noida https://t.co/TRre77xjP3 pic.twitter.com/a1Hd2bEyWb
— NDTV (@ndtv) March 20, 2024