శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని యురి సెక్టార్ వద్ద మంగళవారం పాకిస్థాన్ నుంచి చొరబడిన ఓ ఉగ్రవాదిని పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఉగ్రవాది ఇవాళ యురిలో మీడియాతో మాట్లాడాడు. అతన్ని 19 ఏళ్ల అలీ బాబర్ పత్రాగా గుర్తించారు. లష్కరే తోయిబా, పాకిస్థాన్ ఆర్మీ వద్ద శిక్షణ పొందినట్లు అతను చెప్పాడు. చొరబాటుదారుల ఏరివేత ఆపరేషన్ సమయంలో ఇండియన్ ఆర్మీకి అతను చిక్కాడు. బారాముల్లా జిల్లాలోని పట్టాన్కు ఆయుధాలను సరఫరా చేసేందుకు తనకు పాక్ 20 వేలు ఇచ్చినట్లు బాబర్ తెలిపాడు. అయితే ఆయుధాలను సక్రమంగా చేర్చితే రెండవ ఇన్స్టాల్మెంట్గా మరో 30 వేలు ఇచ్చేందుకు లష్కరే అంగీకరించినట్లు ఆ ఉగ్రవాది చెప్పాడు. ముజాఫరాబాద్లోని లష్కరే క్యాంపులో అతను శిక్షణ పొందాడు. సెప్టెంబర్ 18వ తేదీన ఆరుగురు ఉగ్రవాదులతో కలిసి అతను ఇండియాలోకి చొరబడ్డాడు.