చండీఘర్ : పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పటియాలా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమరీందర్ సింగ్ సోమవారం ఉదయం 11:30 గంటలకు తన నామినేషన్ను ఎన్నికల అధికారులకు సమర్పించనున్నారు.
అమరీందర్ సింగ్ సొంతంగా పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అమరీందర్సింగ్తో బలవంతంగా సీఎం పదవికి రాజీనామా చేయించడంతో ఆయన ఆ పార్టీని నుంచి వైదొలిగి సొంత పార్టీ పెట్టుకున్నారు. బీజేపీతోపాటు శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్)తో కూటమిగా అమరీందర్ సింగ్ సారథ్యంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్ పోటీ చేస్తున్నది.