న్యూఢిల్లీ: ఈ ఏడాది జరిగే నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) పరీక్షల్లో మహిళలకు అనుమతి కల్పించాలని ఇవాళ సుప్రీంకోర్టు తెలిపింది. ఎన్డీఏ పరీక్షల్లో వచ్చే ఏడాది నుంచి మహిళలకు ఛాన్సు ఇవ్వాలని కేంద్రం వేసిన పిటిషన్ను సుప్రీం తిరస్కరించింది. వచ్చ ఏడాది మే నెలలో మహిళల తొలి బ్యాచ్ పరీక్షలు రాయాలని కేంద్రం తన పిటిషన్ లో అభిప్రాయపడింది. అయితే ఈ ఏడాది నవంబర్ 14వ తేదీన రిలీజయ్యే నోటిఫికేషన్లోనే మహిళలకు అవకాశం కల్పించాలని యూపీఎస్సీని సుప్రీం ఆదేశించింది. ఒకవేళ మే 200లో మహిళలు పరీక్షలు రాస్తే, అప్పుడు వాళ్ల రిక్రూట్మెంట్ 2023 జూన్లో జరుగుతుందని, ఇలాంటి చర్యలతో జాప్యం చేయలేమని, అమ్మాయిలకు ఆశలు నింపామని, ఇప్పుడు ఆ ఆశల్ని వమ్ముచేయలేమని సుప్రీం తెలిపింది.