న్యూఢిల్లీ: తమ డిమాండ్ల కోసం రైతులు మరోసారి నిరసనలు, ఆందోళనలకు దిగారు. అయితే వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. భారతరత్న అవార్డు గ్రహీత ఎంఎస్ స్వామినాథన్ కుమార్తె మధుర స్వామినాథన్ దీనిపై స్పందించారు. రైతులు అన్నదాతలని, వారిని నేరస్తులుగా పరిగణించలేమని అన్నారు. (Cannot treat farmers like criminals) కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ స్వామినాథన్కు భారతరత్న పక్రటించిన సందర్భంగా మంగళవారం ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఏఆర్ఐ) ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మధుర మాట్లాడారు. ‘పంజాబ్ రైతులు ఢిల్లీకి పాదయాత్ర చేస్తున్నారు. వార్తాపత్రికల కథనాల ప్రకారం, హర్యానాలో వారి కోసం జైళ్లు సిద్ధం చేశారు. రైతులను నిరోధించేందుకు బారికేడ్లతోపాటు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. వారు రైతులు, నేరస్తులు కాదు’ అని అన్నారు.
కాగా, రైతులతో మాట్లాడాలని దేశంలోని ప్రముఖ శాస్త్రవేత్తలందరినీ తాను అభ్యర్థిస్తున్నానని మధుర అన్నారు. అన్నదాతలను నేరస్తులుగా పరిగణించలేమన్న ఆమె, వారి సమస్యలకు పరిష్కారాలు వెతకాలని సూచించారు. ఇది తన విన్నపమని తెలిపారు. ఎంఎస్ స్వామినాథన్ను మనం గౌరవించాలంటే, భవిష్యత్తు కోసం ప్లాన్ చేస్తున్న ప్రతి వ్యూహంలో రైతులను మనతో తీసుకెళ్లాలని కోరారు.
“These are #Farmers & not criminals…” Dr Madhura Swaminathan, economist & daughter of Bharat Ratna Prof MS Swaminathan. Bharat Ratna was announced for MS Swaminathan recently
“If you have to honour MS Swaminathan then we have to take our farmers along with… pic.twitter.com/GfEeQH1m6C— Tamal Saha (@Tamal0401) February 14, 2024