చెన్నై, జనవరి 7: ‘దేవుడా, దేవుడా.. నువ్వు చోరీకి గురయ్యావు. విగ్రహం దొరికాక తీసుకొచ్చి పూజలు చేశారు. అది నువ్వేనా? తనిఖీ చేయాల్సి ఉన్నది. కోర్టు ఎదుట నిరూపణ చెయ్యాలి’ అని సమన్లు జారీ చేసిందో తమిళనాడు కోర్టు. తిరుపూర్ జిల్లా శివిరిపాలయామ్లోని పరమశివన్ స్వామి ఆలయంలో పురాతన విగ్రహం చోరీ కి గురైంది. వెతికి పట్టుకొన్న పోలీసులు కుంభకోణం ప్రత్యేక కోర్టు ఎదుట ప్రవేశపెట్టి ఆలయ నిర్వాహకులకు అప్పగించారు. పునఃప్రతిష్ఠించి పూజలు కూడా చేస్తున్నారు. విచారణలో భాగంగా విగ్రహాన్ని కోర్టు ఎదుట ప్రవేశపెట్టాలని అదే కోర్టు ఆదేశించింది. దీంతో భక్తులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు.. కింది కోర్టుకు మొట్టికాయలు వేసి, విగ్రహాన్ని తీయాల్సిన అవసరం లేదని తెలిపింది.