న్యూఢిల్లీ: ఉక్రెయిన్తో యుద్ధం ఆపాలంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ను తాము ఆదేశించగలమా? అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో, దాని సరిహద్దుల్లో చిక్కుకుపోయిన భారతీయులను క్షేమంగా తీసుకొచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన ఓ పిటిషన్పై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్లో భారతీయులు చిక్కుకుపోతే సీజేఐ ఏం చేస్తున్నారంటూ సోషల్మీడియాలో తాను ఓ వీడియో చూశానని, ఉక్రెయిన్తో యుద్ధం ఆపాలని రష్యా అధ్యక్షుడిని తాము ఎలా ఆదేశించగలమని సీజేఐ ప్రశ్నించారు. భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్రం చర్యలు చేపట్టిందని గుర్తుచేశారు.