న్యూఢిల్లీ: నకిలీ, నాణ్యత లేని ఔషధాలను తయారుచేసున్న ఫార్మా కంపెనీలపై కేంద్ర, రాష్ట్ర నియంత్రణా సంస్థలు కొరడా ఝళిపించాయి. 18 ఫార్మా కంపెనీల లైసెన్స్లను రద్దు చేశాయి. కేంద్ర, రాష్ర్టాలకు చెందిన నియంత్రణా సంస్థల అధికారులు సంయుక్తంగా 20 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించిన 76 ఔషధ కంపెనీలపై ఇటీవల దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో 18 కంపెనీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని అధికారులు గుర్తించారు.