లండన్ : భారత్, కెనడా దౌత్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు అమెరికాలో రహస్యంగా సమావేశమైనట్టు తెలిసింది. భారత విదేశాంగ మంత్రి జైశంకర్, కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీతో ఇటీవల సమావేశమైనట్టు ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది. దౌత్య పరమైన సంబంధాలు మెరుగుపర్చుకునే దిశగా ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు పైర్కొంది.
అయితే ఈ భేటీపై ఇప్పటివరకు భారత్, కెనడా నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ను హత్య వెనుక భారత అధికారుల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని ఆరోపించడంతో ఇరుదేశాల దౌత్య పరమైన ప్రతిష్టంభన నెలకొన్న విషయం విదితమే.