అహ్మదాబాద్: బాగేశ్వర్ ధామ్ చీఫ్, వివాదస్పద బోధకుడు ధీరేంద్ర కృష్ణ శాస్త్రి (Dhirendra Krishna Shastri) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశమే కాదు, పాకిస్థాన్ను కూడా హిందూ దేశంగా మార్చవచ్చని అన్నారు. ఈ నెల 27న గుజరాత్లోని సూరత్లో జరిగిన భారీ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. గుజరాత్లోని ప్రజలంతా ఇవాళ ఇలా ఏకమయ్యాయని తెలిపారు. గుజరాత్ ప్రజలు ఇలాగే కలిసి ఉంటే భారతదేశమే కాదు, పాకిస్థాన్ను కూడా హిందూ దేశంగా మార్చగలనని అన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, ధీరేంద్ర కృష్ణ శాస్త్రి బోధనలకు జనం విపరీతంగా ఆకర్షితులవుతున్నారు. హిందూ దేశం గురించి ఆయన చేస్తున్న ప్రసంగాలు వివాదస్పదమవుతున్నాయి. మరోవైపు బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24న ధీరేంద్ర కృష్ణ శాస్త్రికి వై కేటగిరీ భద్రత కల్పించింది. అలాగే ఇతర రాష్ట్రాల్లో కార్యక్రమాల నిర్వాహణ సందర్భంగా ఆయనకు ఆ స్థాయిలో భద్రత కల్పించాలని పేర్కొంది.
#WATCH | "…The day people of Gujarat become united like this, not only India but we will also make Pakistan a Hindu nation..," says Bageshwar Dham's Dhirendra Shastri in Surat, Gujarat (27.05.2023)
(Video: Bageshwar Dham's YouTube channel) pic.twitter.com/x9uw9D8anm
— ANI (@ANI) May 29, 2023