న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ఎన్నికల్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)కు ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) ఉండదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. తరచూ అడిగే ప్రశ్నల విభాగాన్ని ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో బుధవారం అప్డేట్ చేసింది.
ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చా అన్న ప్రధాన ప్రశ్నకు సమాధానమిస్తూ ఈవీఎంలకు ఆపరేటింగ్ సిస్టమ్ ఉండదని ఈసీ స్పష్టం చేసింది. వన్టైమ్ ప్రోగ్రామ్ కింద రాసిన ఫర్మ్వేర్ లేదా, మెషిన్ స్థాయి ఆదేశాల ద్వారా మాత్రమే ఇది పనిచేస్తుందని తెలిపింది.