న్యూఢిల్లీ, మే 23: లోక్సభ ఎన్నికల సంగ్రామం తుది అంకానికి చేరుకున్నది. 6వ దశ పోలింగ్లో భాగంగా ఢిల్లీ, హర్యానా, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్టాల్లోని 58 లోక్సభ స్థానాలకు శనివారం(మే 25న) ఎన్నికలు జరగనున్నాయి. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మొత్తం 889 మంది ఎన్నికల బరిలో నిలబడ్డారు. ఈనేపథ్యంలో పోటాపోటీగా సాగిన ఎన్నికల ప్రచారం గురువారంతో ముగిసింది. మనోహర్లాల్ ఖట్టర్ (కర్నాల్) దీపేందర్ హుడా (రోహ్తక్), మేనకాగాంధీ (సుల్తాన్పూర్), మెహబూబా ముఫ్తీ (అనంత్నాగ్-రాజౌర్).. తదితరులు ఈ విడత బరిలో ఉన్నారు. ఇక చివరిదైన 7వ దశ పోలింగ్ జూన్ 1న జరగనున్నది. మొత్తం 57 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.