చండీగఢ్: పంజాబ్లో రాజకీయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక్కడి మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, పీసీసీ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. ఆ తర్వాత సిద్ధూకు పీసీసీ చీఫ్ పదవి దక్కడం, దీనిపై అప్పట్లో సీఎంగా ఉన్న అమరీందర్ అసంతృప్తిగా ఉండటం జరిగింది. ఇదిలా వుండగా సడెన్గా అమరీందర్ను రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం చెప్పింది.
దీంతో అమరీందర్ తన అక్కసును బహిరంగంగానే వెళ్లగక్కారు. వచ్చే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధూను గెలవనివ్వబోనని శపథం చేశాడు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఢిల్లీ పర్యటనకు వచ్చారు. దీంతె ఆయన బీజేపీలో చేరబోతున్నారంటూ ప్రచారం సాగింది. అదే సమయంలో సిద్ధూ కూడా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పంజాబ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
ఈ పరిణామాలపై పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జీత్ చన్నీ స్పందించారు. ‘పార్టీ చీఫ్ ఎవరైనా సరే, అతను కుటుంబ పెద్ద వంటి వాడు. అందుకే నేను సిద్ధూకు ఫోన్ చేశా. కూర్చొని Naమాట్లాడుకుందామని, సమస్యను పరిష్కరించుకుందామని చెప్పా’ అని చెప్పారు. కాంగ్రెస్లో సిద్ధూ వర్గానికి చన్నీ సన్నిహితుడనే సంగతి తెలిసిందే.